బేర్ పంజా
బేర్ ధాటికి వరుసగా నాలుగో రోజూ సూచీలు విలవిలలాడాయి. అంతర్జాతీయంగా మాంద్యం సంభవించవచ్చనే భయాలు పెరగడంతో, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలగా.. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సోమవారం అదే బాటలో నడిచాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల
4 రోజుల్లో రూ.13.30 లక్షల కోట్లు ఆవిరి
డాలర్తో పోలిస్తే రూపాయి 81.67కు
బేర్ ధాటికి వరుసగా నాలుగో రోజూ సూచీలు విలవిలలాడాయి. అంతర్జాతీయంగా మాంద్యం సంభవించవచ్చనే భయాలు పెరగడంతో, ప్రపంచ మార్కెట్లు కుప్పకూలగా.. సెన్సెక్స్, నిఫ్టీ కూడా సోమవారం అదే బాటలో నడిచాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల కారణంగా డాలర్తో పోలిస్తే రూపాయి తాజా జీవనకాల కనిష్ఠానికి చేరడం సెంటిమెంట్ను దెబ్బతీసింది. సోమవారం మరో 58 పైసలు కోల్పోయిన రూపాయి రికార్డు కనిష్ఠమైన 81.67కు పడిపోయింది. బ్యారెల్ ముడిచమురు ధర 0.75 శాతం తగ్గి 85.50 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఐరోపా సూచీలు నీరసంగానే ట్రేడయ్యాయి. గత 8 ట్రేడింగ్ రోజుల్లో విదేశీ మదుపర్లు బిలియన్ డాలర్ల (రూ.8000 కోట్లకు పైగా) షేర్లను అమ్మేశారు. ఇటీవల కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం.
* సూచీల వరుస నష్టాల నేపథ్యంలో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ గత నాలుగు ట్రేడింగ్ రోజుల్లో రూ.13.30 లక్షల కోట్లు తగ్గి రూ.270.11 లక్షల కోట్లకు చేరింది.
* సెన్సెక్స్ ఉదయం 57,525.03 పాయింట్ల వద్ద భారీ నష్టాల్లో ప్రారంభమైంది. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో 57,038.24 పాయింట్ల వద్ద కనిష్ఠానికి పడిపోయింది. అనంతరం కోలుకునే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆఖరి గంటన్నరలో మళ్లీ అమ్మకాలు వెల్లువెత్తడంతో 953.70 పాయింట్ల నష్టంతో 57,145.22 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 311.05 పాయింట్లు క్షీణించి 17,016.30 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 16,978.30- 17,196.40 పాయింట్ల మధ్య కదలాడింది.
* హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ షేరు అరంగేట్రం అదిరింది. ఇష్యూ ధర రూ.330తో పోలిస్తే బీఎస్ఈలో 34.54% లాభంతో రూ.444 వద్ద షేరు నమోదైంది. ఇంట్రాడేలో 59.87% దూసుకెళ్లి రూ.527.60 వద్ద గరిష్ఠాన్ని తాకి, చివరకు 47.24% లాభంతో రూ.485.90 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.4,423.83 కోట్లుగా నమోదైంది.
* సెన్సెక్స్ 30 షేర్లలో 24 కుదేలయ్యాయి. మారుతీ 5.49%, టాటా స్టీల్ 4.22%, ఐటీసీ 3.96%, యాక్సిస్ బ్యాంక్ 3.40%, ఎన్టీపీసీ 3.35%, బజాజ్ ఫైనాన్స్ 3.34%, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.87%, ఎం అండ్ ఎం 2.83%, బజాజ్ ఫిన్సర్వ్ 2.60%, రిలయన్స్ 2.54% మేర డీలాపడ్డాయి. ఏషియన్ పెయింట్స్ 1.31%, హెచ్సీఎల్ టెక్ 1.28%, ఇన్ఫోసిస్ 1.06%, అల్ట్రాటెక్ 0.50% రాణించాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలు నష్టపోయాయి. స్థిరాస్తి 4.29%, వాహన 3.86%, యుటిలిటీస్ 3.72%, విద్యుత్ 3.71%, కమొడిటీస్ 3.32%, ఇంధన 3.17%, చమురు-గ్యాస్ 3.10%, టెలికాం 2.97% పడ్డాయి. బీఎస్ఈలో 2980 షేర్లు నష్టాల్లో ముగియగా, 611 స్క్రిప్లు లాభపడ్డాయి. 116 షేర్లలో ఎటువంటి మార్పు లేదు.
అనిల్ అంబానీకి ఉపశమనం: నల్ల ధన నిరోధక చట్టం కింద నమోదైన పన్ను ఎగవేత కేసులో రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఉపశమనం లభించింది. ఐటీ విభాగం జారీ చేసిన నోటీసులపై నవంబరు 17 వరకు ఎటువంటి చర్యలు తీసుకోరాదని బాంబే హైకోర్టు ఆదేశించింది. రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.814 కోట్లకు పైగా వెల్లడించని మొత్తంపై, అనిల్ అంబానీ రూ.420 కోట్ల పన్ను ఎగవేశారని ఐటీ విభాగం ఆరోపిస్తోంది. అనిల్ అంబానీ ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేశారని, భారత పన్ను అధికారులకు విదేశీ బ్యాంక్ ఖాతా వివరాలను కావాలనే వెల్లడించలేదని అభియోగాలు మోపింది.
* 2022-23లో కొత్తగా 100 తెరలను ప్రారంభించేందుకు రూ.350 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్లు పీవీఆర్ సినిమాస్ వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరికి ఐనాక్స్ లీజర్తో విలీనం పూర్తి కావొచ్చని పీవీఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ గౌతమ్ దత్తా పేర్కొన్నారు.
* తమ ప్లాట్ఫామ్పై ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్ (ఈజీఆర్)లను తీసుకొచ్చేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తుది అనుమతి లభించినట్లు బీఎస్ఈ వెల్లడించింది. చిన్న మదుపర్లు, వాణిజ్యసంస్థలు, దిగుమతిదార్లు, బ్యాంకులు, రిఫైనరీ సంస్థలు, బులియన్ ట్రేడర్లు, ఆభరణాల తయారీదార్లు, రిటైల్ వ్యాపారులు కూడా వీటిని ట్రేడ్ చేసేందుకు త్వరలో అవకాశం కల్పిస్తామని తెలిపింది.
* ఉత్తర ప్రదేశ్, హరియాణల్లో 33.3 లక్షల ఐఓటీ ఆధారిత స్మార్ట్మీటర్లను ఇన్స్టాల్ చేయనున్నట్ల వొడాఫోన్ ఐడియా, ఈఈఎస్ఎల్ తెలిపాయి. ఇప్పటికే ఈ కంపెనీలు 16.7 లక్షల స్మార్ట్మీటర్లను ఏర్పాటు చేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అంచనాలను మించిన ఇన్ఫోసిస్
ఐటీ సేవల దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్, మార్చి త్రైమాసికంలో అంచనాలను మించి రాణించింది. కంపెనీ నికర లాభం ఏకీకృత ప్రాతిపదికన రూ.7,969 కోట్లుగా నమోదైంది. -
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనకున్న వాటాను విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఉద్యోగాల వెల్లువ
దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో నియామకాలు గణనీయంగా పెరిగాయని క్వెస్ కార్ప్ నివేదిక వెల్లడించింది. -
నిప్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులు
నిఫ్టీ నెక్ట్స్ 50 సూచీకి డెరివేటివ్ కాంట్రాక్టులను ఈ నెల 24 నుంచి అందుబాటులోకి తేనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) తెలిపింది. -
శిశు ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా
భారత్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా పేర్కొంది. -
+530 నుంచి -455 పాయింట్లకు
ఆఖర్లో భారీగా అమ్మకాలు చోటుచేసుకోవడంతో, ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు, వరుసగా నాలుగో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 22,000 పాయింట్ల దిగువకు చేరింది. -
బజాజ్ ఆటో 800% డివిడెండు
బజాజ్ ఆటో అంచనాలను మించి ఫలితాలను ప్రకటించింది. మార్చి త్రైమాసికంలో స్టాండలోన్ పద్ధతిన రూ.1,936 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
తమిళనాడులో జేఎల్ఆర్ కార్ల తయారీ?
విద్యుత్ వాహనాల (ఈవీల) దిగుమతుల కోసం ప్రభుత్వం గత నెలలో ప్రతిపాదించిన కొత్త విధానం కింద జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) ఈవీలను యునైటెడ్ కింగ్డమ్ (యూకే) నుంచి దిగుమతి చేసేందుకు టాటా మోటార్స్ ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలుస్తోంది. -
దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానం
మే 1 నుంచి దిల్లీ-దుబాయ్ మార్గంలో ఎయిరిండియా ఎ350 విమానాన్ని నడపబోతోంది. టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా అంతర్జాతీయ మార్గాల్లో ఈ పెద్ద విమానాలను వినియోగించనుంది. -
సంక్షిప్తవార్తలు (7)
హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.412 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. -
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
Google Maps: గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్ని జోడించింది. ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కనిపెట్టేందుకు ఇది సాయపడనుంది. -
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
Nothing: 40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ రెండు ఇయర్బడ్స్ను భారత్ మార్కెట్లో లాంచ్ చేసింది. ప్రారంభ ధర ఆఫర్లో భాగంగా కొనుగోలు చేసిన వారికి డిస్కౌంట్ అందించనున్నట్లు తెలిపింది. -
ఇండిగో ప్యాకేజీ ఫుడ్లో అధిక ఉప్పు.. ఇన్ఫ్లూయెన్సర్ వీడియోపై సంస్థ క్లారిటీ
ఇండిగో విమానాల్లో అందించే ప్యాకేజీ ఫుడ్లో అధికంగా ఉప్పు ఉంటోందని ఓ ఇన్ఫ్లూయెన్సర్ వీడియో రూపొందించాడు. దీనిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఏడాదికోసారి వడ్డీ వచ్చేలా
మీరు దాదాపు రూ.80 లక్షల విలువైన టర్మ్ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించండి. ఒకే కంపెనీ నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు సంస్థల నుంచి సమానంగా పాలసీలను తీసుకోండి. -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
వాలెట్ డబ్బుతోనూ యూపీఐ చెల్లింపులు
రోజువారీ జీవితంలో యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) అంతర్భాగంగా మారింది. ఎన్పీసీఐ చొరవతో ఎన్నో సంస్థలు ఇప్పుడు ఈ సేవలను అందిస్తున్నాయి. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు
తాజా వార్తలు (Latest News)
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు