Loans: రుణ రేట్ల‌ను పెంచిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌, ఇండియ‌న్ బ్యాంకులు

పీఎన్‌బీ, ఇండియ‌న్ బ్యాంకులు రెండూ ఎమ్‌సీఎల్ఆర్ ను వివిధ‌ కాలావ్య‌వ‌ధులకు పెంచాయి.

Updated : 01 Jul 2022 16:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (PNB) మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ (MCLR) ఆధారిత రుణ రేట్లను అన్ని కాల వ్య‌వ‌ధులకు 15 బేసిస్‌ పాయింట్ల (0.15 శాతం) మేర పెంచింది. ఈ పెంచిన రేట్లు నేటి (2022 జులై 1) నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. దీంతో ఎంసీఎల్ఆర్‌తో అనుసంధాన‌మైన రుణాల ఈఎంఐలు పెర‌గ‌నున్నాయి. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ రెగ్యులేట‌రీ ఫైలింగ్ ప్ర‌కారం బ్యాంక్ బేస్ రేటును కూడా 8.50 నుంచి 8.75 శాతానికి పెంచింది.

పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ స‌వ‌రించిన ఎమ్‌సీఎల్ఆర్ ..

ఇండియన్ బ్యాంక్ కూడా..
ఇండియన్ బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్‌, టీబీఎల్ఆర్ (ట్రెజ‌రీ బిల్స్ లింకెడ్ లెండింగ్ రేటు), బేస్ రేటు, బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (బీపీఎల్ఆర్‌)ను పెంచుతున్న‌ట్లు గురువారం ప్ర‌క‌టించింది. కొత్త వ‌డ్డీ రేట్లు 2022 జులై 3 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. వివిధ కాల‌ప‌రిమితులకు ఎంసీఎల్ఆర్‌ను 15 బేసిస్ పాయింట్లు మేర పెంచనుంది. టీబీఎల్ఆర్‌ను వివిధ కాల‌ప‌రిమితుల‌కు 40-55 బేసిస్ పాయింట్ల మేర పెంచారు. అలాగే బేస్ రేటును 40 బేసిస్ పాయింట్ల మేర, అంటే ప్ర‌స్తుతం ఉన్న 8.30 శాతం నుంచి 8.70 శాతానికి పెంచారు. 

ఇండియన్ బ్యాంక్ స‌వ‌రించిన ఎమ్‌సీఎల్ఆర్..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని