Crime news: దళిత విద్యార్థిపై దాష్టీకం.. కొట్టి చంపిన ఉపాధ్యాయుడు
విద్యార్థులకు విద్యా బుద్ధుల నేర్పి వారిని సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఓ పదం తప్పుగా పలికాడని..........
లఖ్నవూ: విద్యార్థులకు విద్యా బుద్ధులను నేర్పి వారిని సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయుడు దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఓ పదం తప్పుగా పలికాడని.. 15ఏళ్ల దళిత విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టి ఆ బాలుడి చావుకు కారణమయ్యాడు. 19 రోజుల పాటు మృత్యువుతో పోరాటంచేసిన ఆ విద్యార్థి నేడు తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్లోని ఔరియా జిల్లాలో జరిగింది.
విద్యార్థి నిఖిత్ దోహ్రే స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. క్లాస్ టెస్టులో భాగంగా నిఖిత్ ఓ పదాన్ని తప్పుగా పలికాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు అశ్విని సింగ్.. ఈనెల 7వ తేదీన ఆ విద్యార్థిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కర్రలు, రాడ్డుతో దాడిచేస్తూ.. కాలితో తన్నుతూ తానో ఉపాధ్యాయుడిననే విషయాన్ని మర్చిపోయాడు. తీవ్ర దాడి కారణంగా బాలుడు స్పృహతప్పిపడిపోయాడు. దీంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషయం విద్యార్థి కుటుంబానికి తెలియడంతో వారు హుటాహుటిన ఆ ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడు స్పృహ కోల్పోయి స్ట్రెచర్పై ఉండటాన్ని చిత్రీకరించి.. సోషల్ మీడియాలో ఉంచగా ఆ వీడియోలు వైరల్గా మారాయి.
కాగా అప్పటినుంచి చికిత్స పొందుతున్న ఆ విద్యార్థి నేడు కన్నుమూశాడు. నిఖిత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న ఉపాధ్యాయుడి కోసం గాలిస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారి వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
Crime News: తమ పొరుగునే ఉంటున్న వ్యక్తి చేతిలో ఓ యువతి లైంగిక దోపిడీకి గురైంది. శారీరకంగా హింస అనుభవించింది. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
పుత్తూరులో భారీ మద్యం డంప్ స్వాధీనం
తిరుపతి జిల్లా పుత్తూరులో భారీ మద్యం డంప్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం కేసులను వైకాపా నాయకులు ప్రైవేటు కళాశాలలో డంప్ చేసినట్లు గుర్తించారు. -
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.