Netaji Mystery: నేతాజీ మరణం.. 77 ఏళ్లుగా మిస్టరీగానే..!
జపాన్లోని రెంకోజి ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhas Chandra Bose) చితాభస్మానికి డీఎన్ఏ పరీక్ష (DNA Test) నిర్వహించేందుకు భారత్తోపాటు జపాన్ ప్రభుత్వాన్ని త్వరలోనే ఆశ్రయిస్తానని నేతాజీ కుమార్తె అనితా బోస్ (Anita Bose) పేర్కొన్నారు.
తాను బతికుండగానే మిస్టరీకి ముగింపు పలుకుతానన్న అనితా బోస్
కోల్కతా: జపాన్లోని రెంకోజి ఆలయం (Renkoji Temple)లో ఉన్న సుభాష్ చంద్రబోస్ (Netaji Subhas Chandra Bose) చితాభస్మానికి డీఎన్ఏ పరీక్ష (DNA Test) నిర్వహించేందుకు భారత్తోపాటు జపాన్ ప్రభుత్వాన్ని త్వరలోనే ఆశ్రయిస్తానని నేతాజీ కుమార్తె అనితా బోస్ (Anita Bose) పేర్కొన్నారు. 77ఏళ్లుగా బోస్ జీవితంపై నెలకొన్న ఈ మిస్టరీని (Mystery) తేల్చడంతోపాటు అస్థికలను భారత్కు తెప్పించడమే ఆయనకు నిజమైన నివాళి అని ఉద్ఘాటించారు. తాను బతికుండగానే ఈ మిస్టరీకి ముగింపు పలికేందుకు కృషి చేస్తానని అనితా బోస్ స్పష్టం చేశారు. 1945 ఆగస్టు 18న సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించారని చెబుతున్నప్పటికీ వాటిపై భిన్నవాదనలు నెలకొన్న నేపథ్యంలో అనితా బోస్ ఈ విధంగా స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పందన కరువు..
‘నేతాజీ కుమార్తెగా.. నేను జీవించి ఉండగానే ఈ మిస్టరీకి ముగింపు పలకాలని కోరుకుంటున్నా. ఇందులో భాగంగా అస్థికలకు డీఎన్ఏ పరీక్ష (DNA Test)నిర్వహించాలని భారత ప్రభుత్వానికి త్వరలోనే విజ్ఞప్తి చేస్తా. వారి స్పందన కోసం కొంతకాలం వేచిచూస్తా. సరైన స్పందన వచ్చిందంటే సరే.. లేదంటే జపాన్ ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తా. ఇందుకు భారత ప్రభుత్వం అంగీకరించినా లేదా ఈ విషయంలో జోక్యం చేసుకోమని చెప్పినా అందుకు అనుగుణంగా నేను ముందుకు వెళ్తా’ అని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనితా స్పష్టం చేశారు. నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్ష చేయాలనే విషయంపై గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ వారినుంచి ఎన్నడూ సరైన స్పందన రాలేదన్నారు.
77 ఏళ్లుగా మిస్టరీనే..
‘1945లో జరిగినట్లు చెబుతోన్న విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారా లేదా అని శాస్త్రీయంగా తేల్చడానికి డీఎన్ఏ పరీక్ష (DNA Test) మనకొక అవకాశం కల్పిస్తుంది. ఈసారి మాత్రం కాలయాపన చేసేది లేదు. కొవిడ్ కారణంగా ఇప్పటికే రెండేళ్లు ఆలస్యమైంది. భారత ప్రభుత్వంతోపాటు జపాన్తోనూ ఏకకాలంలో ప్రయత్నాలు చేస్తా. కేవలం కొన్ని నెలల మాత్రం అస్థికలను భద్రపరచాలని జపాన్ ప్రభుత్వం అప్పట్లో నిర్ణయించింది. కానీ, ఇప్పటికి 77ఏళ్లు గడిచినా నాన్న మరణం మిస్టరీగానే మిగిలిపోయింది’ అని జర్మనీలో ఉన్న అనితా బోస్ చెప్పుకొచ్చారు.
రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నారు..
‘నేను ఏ ఒక్కరి పేరు చెప్పదలచుకోలేదు. కానీ, నేతాజీ జీవితాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వాడుకున్నారన్న మాట వాస్తవం. అలా చేయడం మంచి పద్దతి కాదు. రాజకీయాల్లో లేని వారిలోనూ ఎంతో మంది భారతీయులు నేతాజీని ఆరాధిస్తారు. భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం సుభాష్ చంద్రబోస్కు గౌరవసూచికంగా ఎంతో చేస్తోంది. అదే సమయంలో నా ప్రమేయం, ఒత్తిడి లేకుండా వారెందుకు చొరవ చూపడం లేదో తెలియదు. ఆనాడు జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని చెప్పేందుకు ఆధారాలున్నా, నాతోపాటు అందరికీ ఈ కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో నేతాజీ అస్థికలు మాతృదేశానికి తెప్పించేందుకు నా వంతు కృషి చేస్తా, మా నాన్నకు గుర్తుగా ఈ పని చేయాలనుకుంటున్నా’ అని అనితా బోస్ వెల్లడించారు.
ఇదిలాఉంటే, భారత స్వాతంత్ర్య సమరంలో కీలక పాత్ర వహించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhas Chandra Bose) కనిపించకుండా పోవడం ఏడు దశాబ్దాలుగా మిస్టరీగానే మిగిలిపోయింది. 1945, ఆగస్టు 18న తైపిలో విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరణించారనే వాదన ఉంది. నేతాజీకి చెందినవిగా చెబుతోన్న చితాభస్మం నింపిన పాత్రను 1945 సెప్టెంబరు నుంచి టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపర్చారు. ఈ క్రమంలో ఆయన మరణంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు మూడు దర్యాప్తు కమిషన్లు వేసింది. గతంలో కాంగ్రెస్ హయాంలలో ఏర్పాటు చేసిన షా నవాజ్ కమిషన్ (Shah Nawaz Commission), ఖోస్లా కమిషన్ (Khosla Commission)లు నేతాజీ విమాన ప్రమాదంలోనే మరణించారని తేల్చాయి. కానీ, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖర్జీ కమిషన్ (Mukherjee Commission) మాత్రం ఆయన విమాన ప్రమాదంలో చనిపోలేదని నివేదించింది. ఇలా నేతాజీ మరణంపై భిన్నవాదనలు నెలకొన్న నేపథ్యంలో అస్థికలను భారత్కు తెప్పించి, డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని బోస్ కుమార్తె అనితా బోస్ డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..? -
Lakshadweep: నిమిషానికి 11 ఓడలు.. భారత్ అధీనంలోనే కీలక సముద్ర మార్గం!
లక్షద్వీప్కు సంబంధించి మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే నైన్ డిగ్రీ ఛానెల్. ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. -
World Roundup 2023: విపత్తులు మిగిల్చిన విషాదం.. భీకర యుద్ధాలు!
గడిచిన ఏడాది కాలాన్ని తిరిగి చూస్తే.. ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. -
Vessel Hijack: హైజాక్ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!
మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్