IND vs ENG: ఇంగ్లాండ్తో పోరులో భారత ఐదో బౌలర్ ఎవరు?
ఇంగ్లాండ్తో గతేడాది వాయిదా పడిన ఐదో టెస్టు మరికొద్దిసేపట్లో ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభంకానుంది. అయితే, ఈ మ్యాచ్లో టీమ్ఇండియా తరఫున ఐదో బౌలర్గా...
ఇంటర్నెట్డెస్క్: ఇంగ్లాండ్తో గతేడాది వాయిదా పడిన ఐదో టెస్టు మరికొద్దిసేపట్లో ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభంకానుంది. అయితే, ఈ మ్యాచ్లో టీమ్ఇండియా తరఫున ఐదో బౌలర్గా ఎవరిని ఎంపిక చేస్తారనే విషయంపై స్పష్టత రాలేదు. ఇప్పటికే బుమ్రా, షమి, సిరాజ్ పేస్ బౌలింగ్ బాధ్యతలు చూసుకుంటారని తెలుస్తుండగా స్పిన్ విభాగంలో ఎవరిని తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది.
అయితే, ఇక్కడ టీమ్ఇండియా ఒక స్పిన్నర్ను తీసుకోవాలా లేక ఇద్దరినీ తీసుకోవాలా అనే విషయంపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అశ్విన్, జడేజాను తీసుకుంటే ఇద్దరు స్పిన్నర్లు ముగ్గురు పేసర్లతో లెక్క సరిపోతుంది. లేదా ఇద్దరిలో ఒక్కర్నే తుది జట్టులోకి తీసుకుంటే నాలుగో పేసర్గా శార్దూల్ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే, ఎడ్జ్బాస్టన్ పిచ్ సాధారణంగా పేస్ బౌలింగ్, బ్యాటింగ్కు అనుకూలంగా ఉండటంతో ఐదో బౌలర్గా శార్దూల్నే తీసుకునే వీలుంది. మరోవైపు గతేడాది ఇదే సిరీస్లో అశ్విన్ వంటి కీలక స్పిన్నర్ను పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. అప్పుడు జడేజా, శార్దూల్ తమ శక్తిమేరకు రాణించారు.
భారత జట్టు అంచనా: శుభ్మన్ గిల్, మయాంక్/విహారి/కేఎస్ భరత్, పుజారా, కోహ్లి, శ్రేయస్, పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్/అశ్విన్, షమి, సిరాజ్, బుమ్రా.
పిచ్ ఎలా ఉంది..?
కాగా, ఈ టెస్టు మ్యాచ్లో తొలి రెండు రోజుల పాటు ఆటకు వర్షం వల్ల అంతరాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మూడో రోజు నుంచి వాతావరణం మెరుగుపడుతుందని తెలుస్తోంది. ఇక ఈ పిచ్పై సాధారణంగా పరుగులు బాగానే వస్తాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 307 పరుగులు కాగా.. రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 320. మూడో ఇన్నింగ్స్ సగటు 244 ఉండగా.. నాలుగో ఇన్నింగ్స్ సగటు 152 మాత్రమే. ఇక్కడ సాధారణంగా పేసర్లకు మంచి స్వింగ్ లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘నానమ్మా.. మీ కోడలు పచ్చళ్లు సరిగ్గా చేయట్లేదా?’: ఉపాసన ఫన్నీ వీడియో
-
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
-
పాకిస్థాన్కు ‘క్షిపణి’ సాయం.. చైనా సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షల కొరడా!
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్